దళితుల సమస్యల పై అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం

కర్నూలు : కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ఎస్ జెండా ఆవిష్కరణ చేసినట్లు ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ ముఖ్య అతిదిగా పాల్గొని జెండా ఆవిస్కరణ చేసినట్లు తెలిపారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయమైన హక్కులను అందించి విద్య, వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగంలో సామాజిక న్యాయం చేసి అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.  దళితులకు ఎక్కడ సమస్య వచ్చినా సమస్య పరిష్కారానికి ఎమ్మార్పీఎస్ఎస్ అండగా ఉండి వెనకబడిన వర్గాల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పోరాటాలు చేస్తామన్నారు.

కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు ప్రభుత్వాలు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల,  దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు,  హత్యాచారాలు నివారించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు స్వేచ్ఛ సమానత్వం కొరకు కృషి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు మాదిగ వెల్దుర్తి మండల అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ క్రిష్ణగిరి మండలం అధ్యక్షుడు సుంకన్న మాదిగ క్రిష్ణగిరి మండలం ప్రధాన కార్యదర్శి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ఎస్ మాదాపురం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!