
రాష్ట్ర కమిటీలో శ్రీనివాసరెడ్డి కీలక పదవి
న్యూస్ వెలుగు తుగ్గలి : వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తమ్మారెడ్డి కుమారుడు తుగ్గలి శ్రీనివాసరెడ్డి ను ఎంపిక చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను గురువారం రోజున జారీ చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించినందుకు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం కర్నూల్ నందు వైసిపి జిల్లా అధ్యక్షులు ఎస్.వి మోహన్ రెడ్డి ను,పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ను మర్యాదపూర్వకంగా ఆయన కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి కు పూలమాలలు వేసి మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో బాధ్యతలు అప్పగించిన అధినేత జగన్మోహన్ రెడ్డికు,జిల్లా అధ్యక్షులు ఎస్.వి మోహన్ రెడ్డి కు,మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కు,మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పార్టీ అభివృద్ధికొరకు తన వంతు కృషి చేస్తానని రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.