మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీపీ రామాంజినమ్మ

మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీపీ రామాంజినమ్మ

తుగ్గలి న్యూస్ వెలుగు : తుగ్గలి మండల నూతన ఎంపీపీ గా ఎన్నికైన రాచపాటి రామాంజనమ్మ,వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ను, వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రోజున కర్నూలు నందుగల మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్వగృహానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించి గజమాల వేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ రామాంజినమ్మ,వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు లు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ పదవి రావడానికి సహకరించిన తుగ్గలి మండలం నాయకులకు,కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.వైసిపి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్,జడ్పిటిసి పులికొండ నాయక్, వైస్ ఎంపీపీలు ఎర్ర నాగప్ప,మల్లికార్జున రెడ్డి,మండల అధ్యక్షుడు అట్ల గోపాల్ రెడ్డి,ఎర్రగుడి రామచంద్రా రెడ్డి,రాతన మోహన్ రెడ్డి, తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి, రాంపల్లి నాగభూషణం రెడ్డి,అట్లా బసిరెడ్డి, టిఎండి హుస్సేన్, కోఆప్షన్ మెంబర్ చాంద్ బాషా,సుధాకర్ రెడ్డి,గుంత రఘు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!