
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
తుగ్గలి న్యూస్ వెలుగు; తుగ్గలి మండలం పరిధిలోని తుగ్గలి,జొన్నగిరి,చెన్నంపల్లి,కడమకుంట్ల,శభాష్ పురం,గిరిగెట్ల,రాంపల్లి,ఎర్రగుడి,రాంకొండ గ్రామ పంచాయతీలోని పెండేకల్ ఆర్.ఎస్ స్టేషన్లోని ప్రధాన కూడలిలో పత్తికొండ శాసన సభ్యులు కేయి శ్యాం కుమార్ ఆదేశాల మేరకు రాంకొండ గ్రామ టీడీపీ నాయకులు పెండెకల్ ఆర్.ఎస్ స్టేషన్లోని టీడీపీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ 1982 వ సంవత్సరంలో దివంగత మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఆనాటి స్వార్థ రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తీరును జీర్ణించుకోలేక తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు కృషిచేసి తెలుగుదేశం పార్టీని 29వ తేదీ,మార్చి,1982న మహా మేధావుల సమక్షంలో స్థాపించిన ఎనిమిది నెలలు తిరగకుండానే తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అయిన మహనీయుడు కి.శే.స్వర్గీయ నందమూరి తారక రామారావని,ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేసి,రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆజ్యం పోసిన మహనీయుడు నందమూరి తారక రామారావని,పెద ప్రజల అభ్యున్నతి కోసం పెద ప్రజల ఆకలి చావులు లేకుండా చేసి కిలో 2 రూపాయలకు బియ్యాన్ని అందజేసి పేదల ఆకలి చావులు అరికట్టిన మహనీయుడని,అదే విధంగా రాష్ట్రంలోని వృద్ధాప్య వితంతు పింఛన్లను అందజేసిన మహానుభావుడని,పేద ప్రజల పిల్లలకి ఉచిత చదువుల కోసం గురుకుల పాఠశాలలకు పునాది వేసి పేద ప్రజల పిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశా జ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావని,ఆయన ఆశయ సాధనాలను వెలికిపుచ్చుకుని అన్ని మహత్ కార్యాలను దిగ్విజయంగా పూర్తిచేస్తున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం 75 ఏళ్ళ వయసులో నవయుగ చక్రవర్తిగా ముందుండి నడిపించిన మహామేధావి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ నాయకత్వములో గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కృషి చేసి నిరంతర శ్రామికులుగా కృషి చేసి పార్టీ బలోపేతానికి సహకరిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, వెంకటపతి, మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకట రాముడు చౌదరి,కడమకుంట్ల మాజీ సర్పంచ్ పకీరప్ప,మిద్దె రవి, సంఘాల కృష్ణ, సర్పంచి గౌరవ సలహాదారులు మధు, తెలుగు యువత మండలం అధ్యక్షుడు సత్య ప్రకాష్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాశీమ్ వలి,మహేష్,ఐ టీడీపీ నాయకులు రామకొండ హెచ్ నాగరాజు.ఎం మోహన్,జగన్,అనిత్,ప్రసాద్,బోయ వెంకటేష్,రజాక్,రాజేష్,లాలు,బజారి,
మహిళలు,యువత తదితరులు పాల్గొన్నారు.