
పోలవరాన్ని చంద్రబాబు ఎటిఎంలా వాడరు : అంబటి
గుంటూరు న్యూస్ వెలుగు: మాజీ ఎంపీ వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి సీఎం చంద్రబాబు పై విమర్శన అశ్రలను మరోసారి సంధించారు. పోలవరాన్ని చంద్రబాబు ఓ ఏటీఎం లా వాడుకున్నారని , ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైస్ రాజశేఖర్ రెడ్డి , వైస్ జగన్ పోలవరం నిర్మాణం కోసం శక్తీ వంచనలేకుండా పనిచేసినట్లు తెలిపారు. కాపర్ డ్యామ్ పూర్తి చేయకుండా , డయాఫ్రామ్ వాల్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు కట్టాడో ప్రజలకు తెలుసనీ వారు అన్నారు. చంద్రబాబు బూటకపు మాటలతో ప్రజలను మాయచేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం అభివృద్ధి పనులు జరిగినట్లు అధరాలు ఉన్నాయని దానికోసం ఎక్కడికైనా చర్చకు అంబటి సిద్ధమన్నారు.
Was this helpful?
Thanks for your feedback!