వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా

 వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా

హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బుధవారం వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా స్థానిక బస్టాండ్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హామీద్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన వక్స్ సవరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టింది.కావున ప్రతి ఒక్కరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.వెంటనే వక్స్ బిల్ ను ఆపకపోతే,బిల్లుకు మద్దతు ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్యులర్ ముసుగులో అధికారంలోకి వచ్చి ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేసిందన్నారు.పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే రానున్న రోజుల్లో ఒక్క ముస్లిం ఓటు కూడా ఎన్డిఏకు పడకుండా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు ” రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లు ను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!