టీడీపీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు ఎస్ ప్రతాప్ యాదవ్ 

టీడీపీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు ఎస్ ప్రతాప్ యాదవ్ 

తుగ్గలి న్యూస్ వెలుగు; తుగ్గలి మండలం పరిధిలోని బొంది మడుగుల గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొంది మడుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ యండ చౌడప్ప నేతృత్వంలో గ్రామ సర్పంచ్ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువతి యువకులు ఎవ్వరూ కూడా నష్టపోకూడదని పార్టీ కోసం పని చేసిన టీడీపీ కుటుంబ సభ్యులు బాగుకోసం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు.పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తలు అభిమానులు మహిళలు యువతి యువకులు ఎవ్వరి కుటుంబాలలో అయినా ప్రమాదవశాత్తు మరనించినా,సాదారణ మరణాలు సంభవించినా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మృతి చెందిన కుటుంబాలకు ప్రమాదంలో మరణిస్తే 5లక్షల రూపాయలను,సాదారణ మరణాలు సంభవించినా వారికి 2లక్షల రూపాయల నగదును ఆర్థిక సాయంగా అందించేందుకు పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొంది మడుగుల టీడీపీ నాయకులు కార్యకర్తలు కాసీము,వార్డ్ మెంబర్ వీరేంద్ర,లక్ష్మి నారాయణ,రాముడు,నరేష్,ఈరన్న,రాజు,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!