
రాంపల్లిలో ఘనంగా శ్రీరాముని కళ్యాణ మహోత్సవం
పత్తికొండ న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు గ్రామా పెద్దలు తెలిపారు. శ్రీరాముని పల్లకి హోత్సవానికి ఏర్పాట్లను చేసినట్లు ఈశ్వరయ్య ఆచారి తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్లకి హోత్సవం గుడి దగ్గర మొదలుకొని ఊరి చివరి వరకు నిర్వహిస్తారని పళ్ళహోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకుని , రధ హోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు , పెద్దలు పాల్గొన్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!