
ఘనంగా బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి
హోళగుంద,న్యూస్ వెలుగు :బహుముఖ ప్రజ్ఞాశాలి,ప్రపంచ మేధావి,దేశ దిక్సూచి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా మండల కేంద్రంలో అంబేడ్కర్ సామూహిక వివాహా కార్యక్రమం,ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఎమ్మార్పీఎస్ మాజీ తాలూకా అధ్యక్షులు,ప్రముఖ బహుజనవాది చిన్నహ్యట శేషగిరి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సిద్ధాంతాలు నేటికీ ఎన్నటికీ దేశ ప్రజలంత సగౌరవంగా సమైఖ్యంగా ఆచరించదగ్గ ఆచరణలని ఆయన రాజ్యాంగంపు నీడలోనే నేడు దేశమే దాసోహమై అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య,యువ నాయకులు ఖాదర్ భాష,భాస్కర్,గోవిందు,ఎర్రిస్వామి,గంగన్న,మూర్తి, వైసీపీ నాయకులు ఎంపీపీ తనయుడు ఈసా వైస్ ఎంపీపీ అనువప్ప రామకృష్ణ కృష్ణయ్య మరియు యువజన ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.