
ఉగ్రవాద దాడి భాదిత కుటుంబాలకు సానుభూతిని తెలిపిన డిప్యూటీ సీఎం
న్యూస్ వెలుగు : జమ్మూ & కాశ్మీర్, పహల్గాం లో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదన రావు మృత్యువాత పడటం తీవ్ర బాధాకరమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు తెలిపారు. ఉగ్రవాదం పెను భూతంలా మారిందని భారత్ దీనికి సరైన సమాధానము చెప్పేందుకు సిద్ధమైందని వారు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!