
ఎర్రకోటపై ఎగిరిన మువ్వేన్నల జెండా
ఢిల్లీ : ఎర్రకోటపై ప్రధాన మంత్రి మోడి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రతి అమరవీరునికి, స్వాతంత్య్ర సమరయోధుడికి ఈ దేశం రుణపడి ఉంటుందని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశాన్ని పరిరక్షించడం, పూర్తి నిబద్ధతతో నిర్మించడం, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కోసం అంకితభావంతో పని చేస్తున్న మహానుభావులకు ఈరోజు సెల్యూట్ చేసే సందర్భమని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులు ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించినందుకు దేశం వారికి రుణపడి ఉంటుందని మోదీ అన్నారు. యువత, రైతులు, మహిళలు, గిరిజనులు సహా సమాజంలోని ప్రతి వర్గాల ప్రజలు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారని ఆయన ఉద్గాటించారు . 1857లో స్వాతంత్య్ర పోరాటానికి ముందు కూడా అనేక గిరిజన ప్రాంతాలలో స్వాతంత్య్ర పోరాటం జరిగినట్లు చరిత్రకు సాక్ష్యం అన్నారు.