
వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి: వ్యవసాయ, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇస్తున్న విత్తనాల సబ్సిడీ , ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి అనేక అంశాలను అధికారులతో సిఎం చర్చించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మరో అడుగు వేలయాలని అధికారులకు ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథం అమలుపై అధికారిక ప్రకటన కోసం వేచివుండాలని ముఖ్యమంత్రి అధికారులకు కీలక సూచనలు చేసారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్దంగా ఉందని సిఎం చంద్రబాబు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM