
24 నుండి బ్రంహోత్సవాలు: టీటీడీ
తిరుపతి (న్యూస్ వెలుగు ) : తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి
బ్రంహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు.
ఆయన అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ రోజు జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక
నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ… ఈ నెల 23న శ్రీవారి బ్రంహోత్సవాలు
అంకురార్పణ జరుగుతుందని చెప్పారు. 24న రాష్ట్రపభుత్వం తరఫున ముఖ్యమంత్రినారా చందబాబు నాయుడు
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని బి.ఆర్.నాయుడు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!