ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించేందుకు జాతీయ చట్టాన్ని రూపొందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్రాన్ని కోరింది. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించేందుకు ప్రాథమిక చర్యలుగా సీసీటీవీ కెమెరాల , భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం వంటి తప్పనిసరి భద్రతా చర్యలను కూడా వారు కోరారు.సెక్టార్ లేదా పని ప్రదేశంతో సంబంధం లేకుండా శనివారం ఉదయం 6 గంటల నుండి దేశవ్యాప్తంగా మోడ్రన్ మెడిసిన్ వైద్యుల సేవలను 24 గంటలపాటు ఉపసంహరించుకుంటామని IMA ప్రకటించింది. ఈ కాలంలో, క్యాజువాలిటీ మరియు ఎమర్జెన్సీ యూనిట్లు మాత్రమే పనిచేస్తాయి, అయితే ఔట్ పేషెంట్ విభాగాలు మరియు ఎలక్టివ్ సర్జరీలు నిలిపివేయబడతాయని సూచించారు.

వైద్యులకు భద్రత జాతీయ చట్టాన్ని రూపొందించండి: ఐఎంఏ
డిల్లీ : దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశ నలుమూలల లేడి డాక్టర్ హత్య కాండకు వ్యతిరేకంగా నినాదాలు , ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై నిరసన గలన్నీ వినిపించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. దేశంలో ప్రాణం పోసే డాక్టర్లకే రక్షణ లేకుండా పోయిందని వారు అన్నారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోయిన దేశ ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలు అవసరమని అసోసియేషన బావించినట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!