
అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రండి : హజ్రత్
అమరావతి (న్యూస్ వెలుగు ): కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ నేడు ఆహ్వానించారు. ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి. అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు సీఎం ను కలిసిన వారి లో ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!