
దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఇలా మరణించడం అత్యంత విషాదకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!

