4,913 కోట్లు ల‌బ్ధి చేకూర్చాం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

4,913 కోట్లు ల‌బ్ధి చేకూర్చాం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అమరావతి న్యూస్ వెలుగు : సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న  గంగ‌ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. గత  ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే ల‌క్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు . వివిధ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్యకారుల‌కు రూ.4,913 కోట్లు ల‌బ్ధి చేకూర్చామని గుర్తు చేశారు . గ‌తంలోనే కాదు ఇప్పుడు, ఎప్పుడూ మ‌త్స్యకారులంద‌రికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండ‌గా ఉంటుంద‌ని స్పస్టం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS