దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి: ఉపముఖ్యమంత్రి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి: ఉపముఖ్యమంత్రి

మంగళగిరి న్యూస్ వెలుగు : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికింది’ అని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS