
మౌమిత హత్యాకాండకు వ్యతిరేకంగా ర్యాలీ : చింత సురేశ్ బాబు
కర్నూలు న్యూస్ వెలుగు : కలకత్తా లో జూనియర్ డాక్టర్ మౌమిత మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ … కర్నూల్ జిలా జనసేన పార్టీ కో- ఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో కర్నూల్ పట్టణం లో వైద్య విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డాక్టర్ అయినటువంటి మౌమిత అత్యాచారానికి బాద్యులు అయిన దోషులని తక్షణమే శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైన్యం మౌమిత హత్యాకాండకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తతంగా నిరసనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,వీరమహిళలు,కార్యకర్తల,వైద్య విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!