
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, కర్నూలు నియోజకవర్గ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల త్యాగఫలంతో ప్రస్తుతం ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. కేంద్ర మంత్రిగా విధ్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులతో పాటు దళితుల అభ్యున్నతికి కృషి చేశారని జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి గారు, జిల్లా మరియు కర్నూలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Was this helpful?
Thanks for your feedback!

