
ముగిసిన టెంకాయల వేలం పాట
హోళగుంద, న్యూస్:మండల పరిధిలో దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో టెంకాయల బహిరంగ వేలం పాట పోటాపోటీగా జరిగింది.ఆదివారం ఆలూరు తాలూక ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు.ఇందులో టెంకాయ వేలం పాటను హుళ్ళేబిడు గ్రామానికి చెందిన వీరేశ్ అనే వ్యక్తి రూ.8 లక్షల 15 వేల రూపాయలకు దక్కించుకున్నారు.మరియు వాహనాల రుసుమును నేరణికి గ్రామానికి చెందిన దానప్ప రూ.6 లక్షల 90 వేల రూపాయలకు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిఐ శ్రీనివాస్ నాయక్,ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నేరణికి,నేరణికి తాండ,కొత్తపేట గ్రామస్థులు,రాజా గౌడ,కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist