
కలకత్తా మెడికోని హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి
హోళగుంద, న్యూస్,వెలుగు:ఒప్పంద జీవోలు ఇవ్వాలని కలకత్తా మెడికో విద్యార్థిని హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినంతి పత్రాన్ని మండల ప్రాథమిక వైద్యాధికారి న్యూటన్ సమర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు,వెంకటేష్,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సాలోమీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్ల పై పని భారం పెంచుతుంది తప్ప ఆశా వర్కర్లకు వేతనాలు పెంచడం లేదని,తమతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని విమర్శించారు.ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వంలో ఆందోళన నిర్వహిస్తే ప్రభుత్వం దిగివచ్చి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడానికి యూనియన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకుందన్నారు.ప్రభుత్వ కుదుర్చుకున్న ఒప్పంద జీవోలను వెంటనే ఇవ్వాలి,అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి జీవోలు ఇచ్చేవరకు రిటైర్మెంట్ చేయరాదన్నారు.అంతేకాకుండా కలకత్తా మెడికో విద్యార్థిని హత్య చేసిన నిందితులను శిక్షించాలని,పని ప్రదేశంలో భద్రత కల్పించాలని,మహిళలకు రక్షణ చట్టం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.