
అధిక వర్షాల నుండి పంటలను కాపాడుకోవాలి
హొళగుంద న్యూస్,వెలుగు; అధిక వర్షాల నుండి పంటలను కాపాడుకోవాలని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ రాఘవేంద్ర, ఏ డి ఏ సునీత వ్యవసాయ అధికారుల పంటలను పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి అశోక్ లోకల్, వీఆర్వో నాగరాజు ఆధ్వర్యంలో రైతులు వేసిన పత్తి, మిరప పైరులను పరిశీలిస్తూ, అధిక వర్షాలకు పత్తిలో కాయ కుళ్ళు, ఆకులలో బ్యాక్టీరియా నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అధికారుల సంయుక్త మాట్లాడుతూ ఇటీవల కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న పత్తి మిరప పంటలను రోగనిర్ధారణ నిర్వహించారు. పత్తిలో అధిక వర్షాలకు కాయ కుళ్ళు, తెగులు శోకాయని తెలిపారు. నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ + కాసుగమైసిన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి, పత్తిలో మొక్కలు ఎదగడానికి, కాయలు పగలడానికి పై పాటుగా 30 కేజీలు యూరియా, 20 కేజీలు పటాస్ పై పాటుగా చేరుకోవాలని సూచించారు. అలాగే సూక్ష్మ ధాతువుల నివారణకు నివారణకు ఫార్ములా సిక్స్ పిచికారి చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల మిరపలో కాయ కుళ్ళు నివారణకు టేబకొనేజల్ +సల్ఫర్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.కాయ తోలుచు పురుగుకు కాయలు క్లోరో 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఇమామేట్ బెంజమెట్ 0.5 గ్రామ్ లీటర్ నీటికి కలిపి కాయలు తడిచే విధంగా మిరపలో పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విరుపాక్షి, వి ఏ లు వాణిశ్రీ, భారతి భాయ్, రైతులు ఎర్రి స్వామి,కృష్ణయ్య, సాయి బేస్,వెంకటేష్, తదితర రైతులు పాల్గొన్నారు.