
30 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి
అమరావతి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ పథకం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే 536 మంది కార్మికులకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి, రూ.30 కోట్ల మేర పెండింగ్ వేతనాలు ఆగిపోవడం తో గత కొంత కాలంగా కార్మిలు పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు . వారి సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. జీతాల కోసం రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారనే విషయం తెలుసుకుని, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారుల నుండి వివరాలు తెలుసుకుని, ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు రూ.30 కోట్లు బడ్జెట్ తక్షణమే విడుదల చెయ్యాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి జీవో విడుదల చేసి, రూ.30 కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్ధిక శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పని చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.