
కృష్ణమ్మ హారతుల ట్రయల్ రన్
ఇంద్రకీలాద్రి, విజయవాడ ; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణ నదీమ తల్లికి దుర్గా ఘాట్ నందు నవహారతులు ఇచ్చుటకు గాను ఆలయ వైదిక కమిటీ సూచనల మేరకు ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు పరిశీలించి, అనంతరం ఐదు సెట్ల తో హారతుల ట్రయల్ రన్ నిర్వహించడం జరిగినది. నవహారతుల నిమిత్తం మరికొన్ని సెట్ లు తయారు చేయించడం జరుగుచున్నది.ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లింగం రమాదేవి, ఆలయ డిఈ రవీంద్ర నాధ్ ఠాగూర్, ఇంజినీరింగ్, అర్చక ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!