దివ్యాంగులకు ట్రై సైకిల్లు,వినికిడి పరికరాలను అందజేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

దివ్యాంగులకు ట్రై సైకిల్లు,వినికిడి పరికరాలను అందజేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

ఎంపీడీవో కార్యాలయం వద్ద మొక్కలు నాటిన ఎమ్మెల్యే

మద్దికేర,  న్యూస్ వెలుగు; మండల కేంద్రమైన మద్దికేర నందు పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను, వినికిడి పరికరాలను అందజేశారు. మంగళవారం రోజున మద్దికేరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 96 మంది దివ్యాంగులకు 23 లక్షలు విలువ చేసే బ్యాటరీ ట్రై సైకిళ్లను మరియు వినికిడి పరికరాలను వారికి అందజేశారు.అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో మొక్కలను నాటారు.మద్దికేరలో గల కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలని కస్తూరిబా ఎస్.ఓ జ్యోతికు తెలియజేశారు. అదేవిధంగా మండల పరిధిలోని గల పెరవలి గ్రామం నందు 65 మంది విద్యార్థులకు గాను ఆర్డిటి వారు మంజూరు చేసిన సైకిళ్లను పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు పాఠశాల యందు విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సువర్ణ లత,గ్రామ సర్పంచ్ సుహాసిని,ఎంపీపీ అనిత యాదవ్, జడ్పిటిసి మురళీధర్ రెడ్డి,పారా చిట్టెన్న, పురుషోత్తం చౌదరి,కర్నూలు పార్లమెంట్ కార్యదర్శి ధనుంజయుడు,మాజీ జెడ్పిటిసి రాజన్న యాదవ్,శ్రీనివాసులు, ఉప్పర రంగయ్య,లక్ష్మీనారాయణ,బత్తిన లోకనాథ్ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!