
దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఆదోని సబ్ కలెక్టర్
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ దర్శించుకున్నారు.ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకంభంతో స్వాగతం పలికారు.అనంతం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇందులో భాగంగా నేరణికి,నేరణికి తండా,కొత్తపేట గ్రామాల ప్రజలు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను శాలువ పూలమాలలు వేసి స్వామి వారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు.తదనంతరం మండల కేంద్రానికి చేరుకుని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు.అలాగే రైతులు ఎదురుకుంటున్న భూ సమస్యలు పరిష్కరించాలని వినంతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పంపాపతి,ఎర్రి స్వామి,అంజి,మోహిన్,వెంకటేష్,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda