YS Jagan | ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

YS Jagan | ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

అమరావతి, న్యూస్ వెలుగు : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. లడ్డూ (Laddu) వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల(Tirumala) ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని పేర్కొంటూ వైసీపీ ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది. ఈనెల 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేపట్టాలని వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామి వద్దకు మెట్ల మార్గాన వెళ్లనున్నారు.

ఈనెల 28న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు
తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jagan ) బుధవారం ఎక్స్‌ వేదిక ద్వారా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడుతున్నాని దుయ్యబట్టారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!