
డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడిన చంద్రబాబు
కర్నూలు, న్యూస్ వెలుగు; చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు సెప్టెంబరు 28వ తేదీన శనివారం 15 వ వార్డ్, కర్నూలు లో శ్రీ చెన్నకేశస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి గర్భాలయంలో స్వామి వారికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు వైయస్సార్ సేవాదళ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కర్నూలు పార్టీ క్లస్టర్ 2 ప్రెసిడెంట్ కేదార్ నాథ్.ఈ సందర్భంగా వైయస్సార్ సేవాదళ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కేదార్ నాథ్ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు బుధవార పేట, కర్నూలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించామని తెలిపారు.చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ శుక్రవారం తిరుమలలో భక్తులకు డిక్లరేషన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించుకొని కాలినడకన అలిపిరి నుంచి కాలినడకన వెళ్లిన సంగతి మరిచారా అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ స్వగృహం లోనే గోశాల ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, మరి మీరు ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాల మీద కూడా డబ్బులు దండుకునే వ్యక్తులు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో ఆటలాడుతున్నటువంటి మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పర్ల సూర్యుడు, ఆదిశేషు, మధు, వసంత్, గోపి, భరణి తదితరులు పాల్గొన్నారు.