
వక్ఫ్ బిల్లుపై టీడీపీ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది
వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం
హైదరాబాద్; శనివారం హైదరాబాద్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చామని ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం, దీని వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించామని వక్ఫ్ భూములకు సంబంధించి కలెక్టర్కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది, ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది, ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది. మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు, దీనిపై లోక్సభలో మిథున్రెడ్డి గారు, రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఈ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో కూడా ఉభయసభల్లో చెప్పారు. జేపీసీ మెంబర్ విజయసాయిరెడ్డి వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా ఇచ్చారని అయితే టీడీపీ మాత్రం పార్లమెంట్లో ద్వంద వైఖరి అవలంభిస్తుంది, ఈ ఇష్యూని గందరగోళంలో పడేస్తుంది, టీడీపీ ఇప్పుడు కూడా రెండు కళ్ళ ధోరణి అనుసరిస్తుంది, టీడీపీ పార్లమెంట్లోనే వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదు, కానీ అక్కడ మద్దతిచ్చి ఇక్కడ ఇలా నాటకాలు ఆడుతోందని . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తుంది, దీనిని ముస్లిం సమాజమంతా గమనించాలన్నారు.