చేనేత కార్మికులకు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటోంది

చేనేత కార్మికులకు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటోంది

చేనేతలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ

సత్యసాయి, న్యూస్ వెలుగు;  శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రం క్యాంపు కార్యాలయం నందు మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ప్రస్తుత తరం, యువతీ యువకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేస్తున్నాం. ఆ డిజన్లపై చేనేత కార్మికులకు శిక్షణిస్తున్నాం, కేవలం శిక్షణతోనే సరిపెట్టకుండా చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నాంఎగ్జిబిషన్లు, బజారు ఏర్పాటు చేస్తున్నాం… పెద్ద పెద్ద మాల్స్ లో చేనేత స్టాళ్లు కూడా పెట్టిస్తున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటున్నాం… దీనిలో భాగంగా విజయవాడలో గాంధీ బునకర్ పేరుతో చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం ,ఈ ఎగ్జిబిషన్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2 కోట్లకు పైగా విలువ చేసే చేనేత వస్త్రాలను ఆ ఎగ్జిబిషన్ ద్వారా విక్రయాలు జరిగాయని దీనివల్ల ఎందరో నేతన్నలకు ఆర్థిక దన్ను లభించిందని మంత్రి సవితమ్మ తెలియచేసారు.చేనేత కార్మికులు ఎంతో శ్రమించి తమ సృజనాత్మక శక్తికి పదును పెట్టి గుర్తింపు తెచ్చిన ఈ చేనేత రంగము యొక్క ఆవశ్యకతను తెలియజేయుటకు చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహించి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా సహకార సంఘాల ఉత్పత్తి, అమ్మకాలను మెరుగు పరచి సంఘాల బలోపేతానికి తగు చర్యలు తీసుకొనబడుచున్నవి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన 01.10.2024 నుండి 14.10.2024 వరకు నిర్వహించబోతున్నాము.ఈ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 80 చేనేత సంఘాల మరియు సంస్థలు పాల్గొంటున్నాయి. ఇందులో నూలు చీరలు, పట్టు చీరలు, పావడాలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్, కలంకారి మొదలగు చేనేత ఉత్పత్తులు అమ్మకం జరుగును.

Author

Was this helpful?

Thanks for your feedback!