
సీఎం చంద్రబాబు పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
• 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు
• పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
• బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు దిశా నిర్దేశం చేసిన … జిల్లా ఎస్పీ
కర్నూలు, న్యూస్ వెలుగు; ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంధర్బంగా అక్టోబర్ 1 వ తేదీన కర్నూలు జిల్లా , పత్తికొండ మండలం, పుచ్చకాయలమాడ గ్రామం కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.పత్తికొండ మండలం, పుచ్చకాయలమాడ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో , సిఎం కాన్వాయ్, హెలిపాడ్, సభ సమావేశ ప్రాంగణం , తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.5 మంది డిఎస్పీలు, 38 మంది సిఐలు, 40 మంది ఎస్సైలు , 160 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు , 213 మంది కానిస్టేబుళ్ళు , 24 మంది మహిళా పోలీసులు, 106 మంది హోంగార్డులు, 3 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. జిల్లా ఎస్పీ తో పాటు డిఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, రామాంజినాయక్, సోమన్న, సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఉన్నారు.