సుఖ వ్యాధులపై అవగాహన తప్పనిసరి : రామాంజినేయులు
డోన్ మండలం న్యూస్ వెలుగు : దేవరబండ గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో…ఉచిత వైద్య శిభిరం
నిర్వహించడం జరిగింది. ఈ యెక్క కార్యక్రమానికి సర్పంచ్ డి. పద్మావతి సహాకారంతో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన రక్త పరీక్షలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ తెలిపారు.

అవగాహన కార్యక్రమంలో 104 మెడికల్ ఆఫీసర్ డా.ఎం. శ్రీకాంత్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల వలస కూలీలు,హమాలీ వర్కర్స్, మరియు యువత కు హెచ్.ఐ.వి పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని వారు తెలిపారు. హెచ్.ఐ.వి కేవలం అరక్షిత లైంగిక సంబంధాలు , హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవితో కలుషితమైన సూదులు సిరంజీలు, పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!