
సరస్వతి దేవి అలంకార రూపినిగా శ్రీ వాసవాంబ
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన ఒంటిమిట్ట మెయిన్ బజార్ లో ఉన్న అమ్మవారి శాలలో బుధవారం సాయంత్రం మండల పురోహితులు, కోదండ రామాలయ ఆస్థాన పురోహితులు, అమ్మవారి శాల అర్చకులు అయిన ఏలేశ్వరం .గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో అదనపు అర్చకులు రామావజ్జుల శ్రీకాంత్ శర్మ, ఏలేశ్వరం. బాల గురునాథ శర్మ, ఏలేశ్వరం. గురు దీక్షిత్ శర్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మహా గణపతి పూజ, పంచపాలక, అష్టదిక్పాలక, నవగ్రహ, సప్త మాతృక, వాస్తు కలిస, వాసవి కన్యకా పరమేశ్వరి మహా కలిస షోడశోపచార పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తుల సమక్షంలో అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు సహస్రనామ, అష్టోత్తర కుంకుమార్చన పూజలు,మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు మంగళ హారతి, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. నవరాత్రులలో భాగంగా బుధవారం సాయంత్రం సరస్వతి దేవి అలంకారంలో శ్రీ వాసవి కనకా పరమేశ్వరి మాత ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యాలు కల్పించింది. ఈ సందర్భంగా భక్తులు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న వాసవి మాతను కనులారా వీక్షించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయమంతా అమ్మవారి మూల మంత్రంతో ప్రతిధ్వనించింది.


 Journalist Balu Swamy
 Journalist Balu Swamy