
పెద్దతుంబళం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
నేరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలి
పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన … ఎస్పీ.
కర్నూలు, న్యూస్ వెలుగు; పెద్దతుంబళం పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మంగళవారం వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.అనంతరం పోలీసుస్టేషన్ ఆవరణంలో జిల్లా ఎస్పీ కొబ్బరి చెట్టు మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరు తెన్నులు వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్, ఎక్సైజ్ కేసులను సమీక్షించారు.ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
రౌడీ షీటర్ల కదలికలు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు . పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.జిల్లా ఎస్పీ తో పాటు ఆదోని డిఎస్పీ సోమన్న, సిఐలు ప్రసాద్, గుణశేఖర్ బాబు, నల్లప్ప , పెద్దతుంబళం ఎస్సై మహేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల రాజు ఉన్నారు.