
ముస్లింల స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించండి
గ్రామ సభలో అర్జీ అందజేసిన ముస్లింలు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ముస్లింలకు సంబంధించి స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించాలని తుగ్గలి ముస్లిం పెద్దలు తహసిల్దార్ నాగరాజు కు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం రోజున నిర్వహించిన గ్రామసభలో ముస్లింలు తుగ్గలి తహసిల్దార్ నాగరాజు కు స్మశాన వాటిక స్థలం కోసం అర్జీ ను అందజేశారు.ఈ సందర్బంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ముస్లీమ్ సోదరులు ఎవరైనా అకాల మరణం చెందినపుడు స్మశానం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, ముస్లింలకు సంబంధించి స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించాలని వారు తహాసిల్దార్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్ద అల్లా బకాష్,ఇర్ఫాన్,హయత్ బాషా,కరెంట్ బాషా,నజీర్, తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!