
సైబర్ నేరాల పై అవగాహన
హోళగుంద, న్యూస్ వెలుగు; మండల పరిధిలో గురువారం పెద్దహేట గ్రామాన్ని సందర్శించడం జరిగినది. గ్రామంలో ప్రజలందరికీ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించి అప్రమత్తం చేయడమైనది. బాలికలు, మహిళలపై జరిగే నేరాలు గురించి ఆ నేరాలకు విధించే కఠిన శిక్షల గురించి ఎస్సై బాల నరసింహులు అవగాహన కల్పించడం అయినది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి వారి కుటుంబంతో సంతోషంగా ఉండాలని తెలియజేయడమైనది. మరియు పిల్లలను వారితోపాటు కూలి పనులకు తీసుకెళ్లకుండా స్కూళ్లకు పంపిస్తూ మంచి చదువులు చదివించాలని తద్వారా భవిష్యత్తులో వారి కుటుంబం యొక్క జీవనశైలిలో ఎంతో మార్పు చెందుతుందని విద్య యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గ్రామస్తులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda