
ఘనంగా నేషనల్ ఆక్యుపంచర్ డే వేడుకలు
గుంటూరు, న్యూస్ వెలుగు; ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ మందుల అవసరం లేని ఆరోగ్య విధానం అలవర్చుకోవాలని ఆస్పా భారత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. నేషనల్ ఆక్యుపంచర్ డే వేడుకలలో భాగంగా ఆస్పా భారత్ కార్యాల యంలో ఉత్సవాల బ్రోచర్లను రిలీజ్ చేసి ప్రతిజ్ఞను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఆక్యుపంచర్ అవగాహన చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయాలని మాకాల పిలుపునిచ్చారు. ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ ఆక్యుపంచర్ సైన్స్ ఒక జీవన విధానమని, ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని స్వయంగా అభ్యసించాలన్నారు. ఆక్యుపంచర్ విధానంలో మానవ శరీరంలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీసి, అంతర్గతంగా ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడంలో శరీర శక్తిని పెంచడంలో ఆక్యుపంచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ముంజంపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆక్యుపంచర్ ప్రాక్టీస్ అసోసియేషన్ కన్వీనర్ గా కాశి మహంతి సునీతను, తెలంగాణ కన్వీనర్ గా ఏవీఎస్ కుమారస్వామి, ఒడిశాకు శ్యామల, వెస్ట్ బెంగాల్ కు తౌసిఫ్, ఆస్పా భారత్ జాతీయ అధ్యక్షుడిగా ఏ.రవి, ఉపాధ్యక్షుడిగా ముంజంపల్లి శివకుమార్ లను ఎన్నుకున్నారు