
అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు
వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలోని పద్మ పద్మాక్షి హాస్టల్లోని వారిని అర్ధరాత్రి ఖాళీ చేయమని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కనీస వసతులు సరిగ్గా లేకున్నా పట్టించుకోలేదు కానీ అర్ధరాత్రి పూట ఉన్నపలంగా ఖాళీ చేయమనడం ఏంటని, ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.
Was this helpful?
Thanks for your feedback!