కార్యకర్తలే పార్టీకి  వెన్నెముక

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక

మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకు వెన్నెముక లాంటి వారిని మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తెలియజేశారు. మంగళవారం రోజున తుగ్గలి మండలం పరిధిలోని ముక్కెళ్ళ గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రాంపల్లి తిరుపాల్ నాయుడు అధ్యక్షతన ముక్కెళ్ళ గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు తలారి రామచంద్ర,బొజ్జన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్బంగా మండల టీడీపీ అధ్యక్షులు రాంపల్లి ఆర్ తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను కేవలం 100 రూపాయలతో చేసుకుని భవిష్యత్ కార్యాచరణలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులు నష్టపోకూడదని భవిష్యత్ లో అనుకోని ప్రమాధాలు జరిగినా, సాధారణ మరణాలు చెందిన వారి కుటుంబాల కోసం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారికి పార్టీ సభ్యత్వం చేసుకోవాలని,తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల భీమా వర్తింపజేస్తుందని,తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు మరణించినా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి 5లక్షల రూపాయల భీమా స్వయంగా అందిస్తుందని,కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినా ఏ కార్యకర్త నష్ట పోకూడదు,పార్టీ కార్యకర్తల కుటుంబాలు బాగుంటేనే పార్టీలు బాగుంటాయని తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్. తిరుపాల్ నాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముక్కెళ్ళ గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు మీసాల నాగేష్, జంగం చంద్ర,జంగం శాంతయ్య,అరవ మునెప్ప,అరవ లక్ష్మణ స్వామి,ఫీల్డ్ అసిస్టెంట్ బాలముని,శీను,కుషినేని మునెప్ప,డీలర్ కిష్టన్న,బుల్లెని మహేష్. అరవ జయరాముడు,బండపల్లి మునిస్వామి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!