నేడు పెండేకల్ గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పార్టీ సభ్యత్వంతో ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా… మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు

తుగ్గలి, న్యూస వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు తో ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని తుగ్గలి టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తెలియజేశారు.ఈ సందర్భంగా బుధవారం రోజున పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు ఆదేశాల మేరకు రామకొండ గ్రామపంచాయతీ నందు ఉదయం తొమ్మిది గంటలకు రామకొండ గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందుచూపుతో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మరియు కార్యకర్తల సంక్షేమం కొరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని వారు తెలియజేశారు.ప్రతి కార్యకర్త వంద రూపాయల సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక భరోసాను కల్పిస్తుందని వారు తెలియజేశారు. కావున 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మసాలా శీను,డాక్టర్ చంద్ర,చాంద్ భాష,లాలప్ప, మారెళ్ళ డీలర్ వెంకట్రాముడు,ఐటీడీపీ నాయకులు నాగరాజు,తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!