నేడు శ్రీ పెరవలి రంగనాథ స్వామి వారి హుండీ లెక్కింపు ; ఈవో వీరయ్య

నేడు శ్రీ పెరవలి రంగనాథ స్వామి వారి హుండీ లెక్కింపు ; ఈవో వీరయ్య

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ భూదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి  హుండీ లెక్కింపు మంగళవారం రోజున ఉదయం 10 గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుందని దేవాలయ కార్యనిర్వాహణ అధికారి వీరయ్య తెలియజేశారు.సోమవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల భక్తులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆయన తెలియజేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొను వారు తప్పనిసరిగా లుంగీ మరియు కండువాను ధరించి పాల్గొనాలని పెరవలి రంగనాథ స్వామి కార్యనిర్వాహణాధికారి వీరయ్య తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!