
ముగిసిన రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
హుండీ ఆదాయం పది లక్షల 62 వేల 160 రూపాయలు.
పెరవలి రంగనాథ స్వామి దేవాలయ కార్యనిర్వాహణాధికారి వీరయ్య.
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి:మద్దికేర మండల పరిధిలోని గల పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ భూదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి హుండీను మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు దేవాలయ కార్యనిర్వహణాధికారి వీరయ్య మరియు ప్రత్యేక పర్యవేక్షణ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హుండి లెక్కింపును ప్రారంభించారు.శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు శాశ్వత హుండి ఏడు నెలల ఎనిమిది రోజుల వ్యవధిలో పది లక్షల అరవై రెండు వేల 160 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వీరయ్య తెలియజేశారు.ఈ హుండీ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వర్లు మరియు ఆలయ ముఖ్య అర్చకులు రంగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. భక్తుల నుంచి వచ్చిన ఈ హుండీ ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధి కొరకు వినియోగిస్తామని వారు తెలియజేశారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది,గ్రామ ప్రజలు,సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.