దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి

బండి ఆత్మకూరు,న్యూస్ వెలుగు: విభిన్న ప్రతి భా వంతులకు విద్యా సామాజిక ఆర్థిక రంగాల లో అభివృద్ధి చెందడం కోసం వారిసంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమాలతో పాటు సామాజికపరంగా ఆర్థికపరంగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని దివ్యాంగులసంఘం గౌరవా ధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి అన్నారు. బండి ఆత్మకూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో విభిన్న ప్రతిభావంతుల ఆవాస కేంద్ర నంద్యాల జిల్లా డైరెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు, వారికి అవసరమైన పరికరాలను అందించడం కోసం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండలపరిషత్ అభివృద్ధిఅధికారి దస్తగిరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు వారియొక్క ప్రతిభను గుర్తించి వారికి విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించడంతోపాటు, వారికి సామాజికంగా గౌరవప్రదమైన జీవనశైలి లభించే విధంగా సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతే కాకుండా వారికి దినస రిజీవిత కార్యక్రమంలో భాగంగా వారికికనీస అవసరాలైన ట్రై సైకిళ్లు, బాటరీ వాహనాలు, చెక్క కర్రలు,వినికిడి యంత్రాలు,లాప్ టాప్ లు, గుర్తింపు కార్డులు ప్రభుత్వం నంద్యాల జిల్లా విభిన్న ప్రతి భా వంతు ల పునరా వాస కేంద్రం ద్వారా మంజూరు చెయ్యడం సంతోషక ర విషయం అని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం గురించి వారి హక్కుల గురించి దివ్యాంగులకు తెలియజేయడం జరిగింది, విభిన్న ప్రతిభావంతుల కొరకు మా సహాయ సహకారములు అందిస్తామని భరోసా కల్పించారు.డి డి ఆర్ సి స్పెషల్ ఎడ్యుకేటర్
నాగరాజు,, మొబిలిటీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,లింగ మోహన్ రెడ్డి,దానం బాబు, రమీజాభి నాగమ్మ దస్తగిరి, రామలింగం వెంకటసుబ్బయ్య రమేష్ నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!