
గ్యాస్ సిలిండర్ల దొంగను పట్టుకున్న పోలీసులు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; గత రెండు నెలల నుంచి మండలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న బిల్లలాపురం గ్రామానికి చెందిన జగటి తేజ రామాయ్యను బుధవారం పోలీసులు వారధి బ్రిడ్జి దగ్గర పట్టుకున్నారు. బండి ఆత్మకూరు ఎస్సై జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు ఎల్పిజి సిలిండర్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ప్రత్యేక నిఘ ఉంచి పట్టుకున్నామని తెలిపారు. దొంగ నుండి 36 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నమన్నారు. సంతజూటురు గ్రామానికి చెందిన రామకృష్ణ చికెన్ షాప్ లో5 సిలిండర్లు భారత్ గ్యాస్ గోడౌన్లో 31 సిలిండర్లు దొంగలించడం జరిగిందన్నారు. దొంగ నుండి గ్యాస్ సిలిండర్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు. జగటి తేజ రామయ్య పై బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!