
14న కడప కలెక్టరేట్ ఎదుట మహాధర్నాను జయప్రదం చేయండి
గోడపత్రికలను ఆవిష్కరించిన సిపిఎం పట్టణ కార్యదర్శి జి.ఏసుదాస్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 14న కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం పట్టణ కార్యదర్శి జి.ఏసుదాస్ తెలిపారు. మహాధర్నా జయ ప్రధం కోసం ఆదివారం జమ్మలమడుగు స్థానిక ఎన్జీవో కార్యాలయంలో గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు సామాన్య పేద మద్య తరగతి ప్రజలపై దాదాపు 18 వేల కోట్ల రూపాయల తీవ్రమైన భారం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోపిందని ఆయన దజమెత్తారు. అదేవిధంగా కడప జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొన్నదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలలో కడప జిల్లాలో ఒక్క మండలం కూడా కరువు మండలం ప్రకటించకపోవడం చాలా అన్యాయమని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ నేపథ్యంలో ప్రజలపై విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో భారాలు మోప డం చాలా దుర్మార్గకరమని ఆయన తెలిపారు. ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క చెప్తున్న ఆచరణలో సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనలకే పరిమితం అయిందని ఆయన తెలిపారు విభజన హామీల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు పై డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నాకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గపూర్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహా ధర్నా లో జిల్లా ప్రజానీకం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఏ.వినయ్ కుమార్, డి.విజయ్ ,ప్రభాకర్, శ్రీను , ఎస్ఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి హరిబాబు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.