
ప్రకృతి వ్యవసాయ క్యాలెండర్ ఆవిష్కరణ
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రాంపల్లి గ్రామ ప్రజలు,గ్రామ రైతుల సమక్షంలో తుగ్గలి మండలం టిడిపి మండల కన్వీనర్ రాంపల్లి తిరుపాల్ నాయుడు ప్రకృతి వ్యవసాయ క్యాలెండర్ ను సోమవారం రోజున ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ రాంపల్లి తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయని,అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు, ఆకుకూరలు,కూరగాయలను మనం తినడం వల్ల మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మండల కోఆర్డినేటర్ లింగప్ప,ఐసిఆర్పి రాముడు,రాంపల్లి గ్రామ రైతులు నాగిరెడ్డి,శ్రీనివాసులు,నరసింహులు, మద్దిలేటి,చాకలి లాలప్ప గురుదాస్ రెడ్డి,రైతులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.