
ఎండియూ రేషన్ వాహనం కాలనీకి పంపాలి
హోళగుంద, న్యూస్:మండల కేంద్రంలో సోమవారం బుడగ జంగాల కాలనీ వాసులు తమ కాలనీకి 5 నెలల నుంచి ఎండియూ రేషన్ వాహనం రావడం లేదని తహసీల్దార్ సతీష్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 500 కుటుంబాలు ఉన్న మా కాలనీకి ఎండియూ రేషన్ వాహనం రాకపోవడంతో వృద్దులు,వికలాంగులు,అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారు రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకున్నేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధిత సమస్య పై డిప్యూటీ తహసీల్దార్ కు విన్నపించిన ఉపయోగం లేదని మండిపడ్డారు.కావున మా బుడగ జంగాల కాలనీ ఎండియూ రేషన్ వాహనం ద్వారా బియ్యం పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.టీడీపి నాయకులు కాకి సీతయ్య,బాగోడి రామ,రామాంజిని,చిన్నకట్ట మారెప్ప తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda