
అధికారులకు నిర్లక్ష్యం తగదు : ఎంపీపీ ఎర్ర నాగప్ప
సర్వ సభ్య సమావేశంలో అధికారులకు చురకలు ….
ఇకనుంచి ఎంపీడీవోతో కలిసి గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తనిఖీకి వెళ్తా
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మండల ఎంపిడిఓ విశ్వ మోహన్ ఆద్వర్యంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఎర్ర నాగప్ప మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ప్రతినిధి ఎర్ర నాగప్ప మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను, గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని మండల ఎంపీపీ ఎర్ర నాగప్ప తెలియజేశారు. అలాగే మండల సమావేశం నిర్వహించేటప్పుడు మండల అధికారులు కొంతమంది సమావేశానికి ఆలస్యంగా రావడం చాలా బాధాకరమని ఎంపీపీ ఎర్నాగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచైనా సర్వసభ సమావేశానికి మండల అధికారులు సరైన సమయానికి రావాలని మండల అధికారులను కోరడమైనది. ఇకనుంచి ఎంపీడీవో తో కలిసి గ్రామాలలో తిరిగి తనిఖీ చేయడం జరుగుతుందని సమావేశంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప తెలిపారు. హౌసింగ్ డి ఈ విజయ్ కుమార్ ను కొత్త హౌసింగ్ బిల్లును ఎంత అని ప్రజా ప్రతినిధులు అడగగా హౌసింగ్ డి ఈ ఇప్పటివరకు 1,80,000 మాత్రమే కొత్త బిల్లు నాలుగు లక్షలు గురించి ఇప్పటి వరకు మాకి ఎలాంటి సర్కులర్ రాలేదని ఒకవేళ వస్తే తెలియచేస్తామని అలాగే ఇల్లు కట్టుకునే లబ్ధిదారులు కు ప్రతి గ్రామానికి ఒక అధికారి నియమించడం జరిగింది. ఆదికారిని కలవండి అని సమావేశంలో ప్రజాప్రతినిధులకు తెలిపారు. అలాగే రెవెన్యూ అధికారి డిప్యూటీ తాసిల్దార్ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, మరియు ఎలక్ట్రికల్ ఏఈ మహేశ్వర్ రెడ్డి, విద్యాధికారి రామ వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, వారి వారి శాఖలకు సంబంధించిన విషయాలను ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప జడ్పిటిసి పులికొండ నాయక్ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశానికి పోలీస్ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.