లోకాయుక్త,హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలి

లోకాయుక్త,హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలి

రాష్ట్రస్థాయి కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరిన మద్దిపాటి శైలజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజుకు వినతిపత్రం అందచేసిన ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్.

కర్నూలు, న్యూస్ వెలుగు: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం, లోకాయుక్త కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజుకు ఆయన కార్యాలయంలో గురువారం సాయంత్రం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన సమయం నుండి రాయలసీమ హక్కులకొరకై అనేక పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వంలో కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసారని అయితే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యాలయాలైన వాటిని అమరావతికి తరలించడాని ప్రయత్నాలు చేస్తుందని వాటిని కర్నూలులోనే కొనసాగించాలేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియచేయాలని కోరారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాల్సివున్న ప్రభూత్వాలు ఒంటెద్దుపోకడతో అమరావతి, వైజాగ్ అంటూ రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించాయని పూర్తిగా వెనుకబడిన రాయలసీమ హక్కులను నెరవేర్చాల్సిన భాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నదని అయితే అందుకు భిన్నంగా కర్నూలులో ఏర్పాటైన రాష్ట్రస్థాయి కార్యాలయాలు లోకాయుక్త,మానవహక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించకుండా చూడాలని రాయలసీమ రవికుమార్ కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజును కోరారు. అలాగే రాష్ట్రస్థాయి కార్యాలయాలైన మానవహక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టులను కోరి రాయలసీమ ప్రాంతాన్ని,హక్కులను అవమానపరచిన డాక్టర్ మద్దిపాటి శైలజపై చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మదాసికురువ ప్రకాష్,కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!